శ్రీవారి ఆభరణాల మిస్సింగ్ పవన్‌కు ముందే తెలుసు

 

టీటీడీ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు.. శ్రీవారి ఆభరణాలు పోయాయంటూ టీటీడీ పాలకమండలి మీద, ప్రభుత్వాల మీద ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా పవన్ స్పందించారు.. 'కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి కలిశారు.. అప్పుడాయన శ్రీవారి ఆభరణాల మిస్సింగ్ కు సంబంధించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.. ఆయన చెప్పిన దాని ప్రకారం శ్రీవారి ఆభరణాలు మన దేశం నుండి మిడిల్ ఈస్ట్ కంట్రీకి ఒక ప్రైవేటు ఎయిర్ క్రాఫ్ట్ లో తరలివెళ్లాయి'.. అందుకే ఇప్పుడు అర్చకులు, ఆభరణాలు మిస్ అయ్యాయని చెప్తే  తనకి ఆశ్చర్యం కలగలేదని పవన్ ట్వీట్ చేసారు.. అలానే పింక్ డైమండ్, ఆభరణాల మిస్సింగ్ గురించి రమణ దీక్షితులు చేసిన ఆరోపణలకు ఏపీ ప్రభుత్వం ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేదని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని పవన్ ట్వీట్ చేసారు.