ఆర్డినెన్స్‌ అమలయ్యే విధంగా కృషి చేస్తా...

 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే కదా. ఈ పర్యటనలో భాగంగా... పవన్ కళ్యాణ్ ఫాతిమా కాలేజ్ విద్యార్దులను కలిసిన సంగతి కూడా విదితమే. తమ సమస్యల పరిష్కారానికి సహాయపడతానని పవన్ అప్పుడు చెప్పారు. ఇప్పుడు...మరోసారి హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో కడప జిల్లా ఫాతిమా కళాశాల విద్యార్థులు, తల్లిదండ్రులను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థుల సమస్య పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. న్యాయం తప్పక విజయం సాధిస్తుందన్న పవన్‌ కల్యాణ్‌.. ఆర్డినెన్స్‌ అమలయ్యే విధంగా కృషి చేస్తానని వెల్లడించారు. విద్యార్థులకు బాసటగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో ఆయన మాట్లాడుతున్నారు. ఇక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నందుకు పవన్‌ కల్యాణ్‌కు విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.