లండన్ చేరుకున్న పవన్... అవార్డ్ ప్రదానం నేడే..


 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు  'ఇండియా-యూరోపియన్ బిజినెస్ ఫోరం' ఎక్స్‌లెన్సీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు లండన్ వెళ్లారు. ఆయ‌న‌కి అక్క‌డ భారీ స్వాగ‌తం ల‌భించిన‌ట్టు తెలుస్తుంది.  బ్రిటన్‌లోని హౌజ్ ఆఫ్ లార్డ్స్ సమావేశంలో పవన్‌కల్యాణ్‌కు అవార్డును ప్రదానం చేయనున్నారు. పలు ప్రజా సమస్యలపై ఈయన స్పందిస్తున్న తీరుకి గాను పవన్ ని ఈ అవార్డుకి ఎంపిక చేశారు. రెండు రోజులపాటు లండన్ లో ఉండే పవన్ కల్యాణ్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.