కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాకిస్థాన్

 

పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆపరేషన్ సిందూర్ తరువాత ఇరు దేశాల మధ్యా నెలకొన్న యుద్ధవాతావరణం నేపథ్యంలో పాక్ అభ్యర్థన మేరకు భారత్ సీజ్ ఫైర్ కు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ తరువాత తొలి సారిగా సరిహద్దుల్లో పాకిస్థాన్ ఒక్కసారిగా కాల్పులకు తెగబడటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాక్ సైనికులు భారత సైనిక పోస్టులు లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.

ప్రతిగా భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. దాదాపు పావుగంట సేపు ఈ కాల్పులు జరిగాయి. అయితే భారత సైన్యం దృష్టి మళ్లించి ఉగ్రవాదుల చొరబాటుకు అవకాశం కల్పించడానికే పాక్ సైన్యం కాల్పులకు తెగబడి ఉంటుందని భావిస్తున్న ఇండియన్ ఆర్మీ బోర్డర్ లో హై అలర్ట్ ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News