ఒడిశా మాజీ సీఎం ఏపీలో మృతి

 

ఒడిశా మాజీ సీఎం, అసోం మాజీ గవర్నర్ జెబీపట్నాయక్ మంగళవారం కన్నుమూశారు. సోమవారం తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రీయ విద్యాపీఠ్ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం జేబీ పట్నాయక్ తుదిశ్వాస విడిచారు. జేబీ పట్నాయక్ దాదాపు 14 ఎళ్లు ఒడిశాకు సీఎంగాను, తర్వాత అస్సాంకు గవర్నర్ గా కూడా పనిచేశారు. ఆయన మృతికి పలువురు నేతలు సంతాపం తెలిపారు.