సినిమావాళ్ళే కొంపముంచారు

 

ఒకప్పుడు ఆంధ్రాబ్యాంక్ ఓ వెలుగు వెలిగింది. అయితే ఈమధ్య కాలంలో ఆంధ్రాబ్యాంకు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మొండి బకాయిలు వసూలు కాకపోవడంతో తంటాలు పడుతోంది. మా బాకీలు తీర్చండి మహాప్రభలో అంటూ ఆంధ్రాబ్యాంకు ఉద్యోగులు బకాయిదార్ల ఇళ్ళ ముందుకు వెళ్ళి ప్లకార్డులతో ప్రదర్శన చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. ఆంధ్రాబ్యాంకు నెత్తిన టోపీ పెట్టిన వాళ్ళలో మామూలు జనం మాత్రమే కాకుండా సినిమావాళ్ళు, రాజకీయ నాయకులే ఎక్కువమంది ఉన్నారట. ముఖ్యంగా సినిమావాళ్ళు భారీ స్థాయిలో బకాయిలు ఉన్నారట. ఈ విషయాన్ని ఆంధ్రాబ్యాంకు సీఎండీ సీవీఆర్ రాజేంద్రన్ వ్యాఖ్యానించారు. బ్యాంకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సినిమా తారలు, రాజకీయ నాయకుల వల్లే తమ బ్యాంకులో నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) పెరిగిపోయాయని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.