చెవిరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు

 

వైసీపీకి చెందిన చిత్తూరు జిల్లా చంద్రగిరి శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కరరెడ్డి మీద సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. స్పీకర్ మీద చెవిరెడ్డి భాస్కరరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అధికార పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిది. ప్రివిలేజ్ మోషన్ కోరిన చీఫ్ విప్ కాలువ శ్రీనివాసులు ఆ మేరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ప్రతిపాదించారు. ఈ అంశాన్ని స్వీకరించామని.. తరువాత చూద్దామని.. బడ్జెట్‌పై చర్చను మొదలు పెట్టాలని స్పీకర్ కోరారు. ఆ తర్వాత కూడా సభ కొనసాగకుండా వైసీపీ సభ్యులు అడ్డు తగులుతూనే వున్నారు.