ఉత్తర కొరియా నియంత...మంత్రిని, అధికారులను నడిరోడ్డుపై చంపించిన వైనం


ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్-ఉన్ ఎవరి మాట వినడూ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు తన మాట విననందుకు ఎంతటి దారుణానికైనా సిద్దపడతాడన్న విషయం తాజా ఘటన బట్టి అర్ధంచేసుకోవచ్చు. తన మాటను జవదాటారన్న కోపంతో ఏకంగా ఒక మంత్రి, ఇద్దరు అధికారులను అత్యంత కిరాతంగా చంపించాడు. అది కూడా ప్రజల మధ్య. కిమ్ జాంగ్-ఉన్ నేతృత్వంలో పనిచేస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి హ్వాంగ్ మిన్, విద్యాశాఖలోని ఉన్నతాధికారి రీ యాంగ్ జిన్ తన ఆదేశాలు నిర్లక్ష్యం చేశారన్న కోపంతో.. యుద్ధ విమానాలను పేల్చేసే క్షిపణులను వాడి ఆయన చంపించాడని తెలుస్తుంది. కాగా కిమ్ జాంగ్-ఉన్ కు ఇది కొత్తేమి కాదు. గతంలో కూడా తన సొంత మామను, గత సంవత్సరంలో మాజీ రక్షణ మంత్రిని ఆయన బహిరంగంగా హత్య చేయించారు. మొత్తానికి ఇంత పైశాచికంగా.. అందరి ముందు చంపుతున్నా దీన్ని తప్పు పట్టకపోవడం ఆశ్చర్యకరం..