నీతి ఆయోగ్ సమావేశానికి కేజ్రీవాల్, మమత డుమ్మా

దేశ ఆర్థికాభివృద్ధికి సంబంధించి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌పై సమావేశానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గైర్హజరయ్యారు. ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలు జరుగుతుండటంతో కేజ్రీవాల్ రాలేదు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, నీతీ ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియా హాజరయ్యారు. దేశాభివృద్ధికి సంబంధించి వచ్చే ఏడేళ్లలో అనుసరించాల్సిన వ్యూహం, మూడేళ్ల యాక్షన్ ప్లాన్‌పై ప్రధాని మోడీ ముఖ్యమంత్రులతో చర్చించారు. కాగా ఈ సమావేశానికి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల పాలిత రాష్ట్రాల సీఎంలు అమరీందర్ సింగ్, వీరభద్ర సింగ్, మాణిక్ సర్కార్, పినరయి విజయన్ పాల్గొన్నారు.