నిర్భయ కేసులో నలుగురికి ఉరిశిక్ష

 

Death sentence to rapists, delhi gang rape, nirbhaya case Death sentence to rapists

 

 

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో నలుగురు దోషులకు సాకేత్ కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇదే కేసులో ఉన్న మరో బాల నేరస్థుడికి జువైనల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఇక ఇదే కేసులో ఉన్న మరో ప్రధాన నిందితుడు రాసింగ్ గత మార్చిలో తీహార్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నలుగురి నిందితులపై 13 అభియోగాలు రుజువైన నేపథ్యంలో వారికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. శిక్షపడిన వారిలో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మ, వపన్ గుప్తా, ముఖేష్ లు ఉన్నారు. నిందితులకు సరయిన శిక్ష పడిందని కోర్టు వద్దకు వచ్చిన విద్యార్థి సంఘాలు అభిప్రాయపడ్డాయి. ఇక కోర్టు తీర్పు మీద దేశ వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది.