అరుంధతి చూస్తూ వధువు మృతి..!

 

కుటుంబ సభ్యులు, బంధువుల ఆనందం సాక్షిగా.. వేదమంత్రాల నడుమ జరిగిన పెళ్లి విషాదంగా ముగిసింది.. నాగర్‌కర్నూలు జిల్లాలోని అచ్చంపేటలో వెంకటేష్ అనే యువకుడికి వివాహమైంది.. సాంప్రదాయంలో భాగంగా వరుడు అరుంధతి నక్షత్రం చూపించగా.. నవవధువు ఆ నక్షత్రాన్ని చూస్తూ ఒక్కసారిగా వరుడి పాదాలపై కుప్పకూలింది.. బంధువులకు కొన్ని క్షణాలు ఏం అర్ధం కాలేదు.. వెంటనే వధువుని హాస్పిటల్ కు తరలించారు.. కానీ ఆమె అప్పటికే మరణించిందని, గుండెపోటు కారణమని డాక్టర్ చెప్పారు.. అత్తవారింట్లో అడుగుపెట్టాల్సిన నవ వధువు, ఇలా పెళ్ళైన కొద్దిసేపటికే తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో ఇరు కుటుంబాలలో విషాదం నెలకొంది.