పది అడుగులు జరిగిన కాట్మండూ

 

భారీ భూకంపం కారణంగా నేపాల్ రాజధాని కాట్మండూ గతంలో ఉన్న ప్రదేశంలోకంటే 10 అడుగులు దక్షిణం వైపుకి జరిగిపోయింది. ఈ విషయాన్ని భూగర్భ శాస్త్ర నిపుణులు వెల్లడించారు. భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా నేపాల్ ప్రాంతానికి భూకంపాలు తప్పనిసరి. అలాగే నేపాల్ నగర్ ఉన్న ప్రదేశంలో శతాబ్దాల క్రితం పెద్ద సరస్సు వుండేదట. ఇలాంటి ప్రదేశంలో వుండటం వల్లే కాట్మండూ నగరం భూకంపం తీవ్రతకు భారీగా గురైంది. ఇక్కడి భౌగోళిక పరిస్థితులను బట్టి ఇక్కడ ప్రతి 75 సంవత్సరాలకు ఓసారి భారీ భూకంపం రావడం తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కోట్ల సంవత్సరాల క్రితం ఇండియన్, యురేసియా టెక్టానిక్ ప్లేట్లు (భూ ఫలకాలు) రెండూ పరస్పరం ఢీకొన్నాయి. అప్పటి నుంచి అప్పుడప్పుడు అలా ఢీకొనడం, భూకంపాలు సంభవించడం జరుగుతూనే వుంది.