నేపాల్‌లో కూలిన మరో విమానం!

నేపాల్ దేశం విమాన ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. సంవత్సరం క్రితం ఒక విమానం కూలి భారీగా జననష్టం జరిగింది. ఇప్పుడు కాఠ్మండూ విమానాశ్రయంలో మరో విమానం టేకాఫ్ అవుతున్న సమయలో కూలిపోయింది. కాఠ్మండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల సమయంలో కాఠ్మండూ నుంచి పొఖారాకి బయల్దేరిన బాంబేర్డియన్ సీఆర్‌జే 200 విమానం టేకిప్ అయిన కొద్ది క్షణాల్లోనే కూలిపోయింది. దీంతో మంటలు చెలరేగి విమానం మొత్తం దగ్ధమైంది. ప్రమాద సమయంలో విమానంలో సిబ్బందితో సహా 19 మంది వున్నారు. ఈ దుర్ఘటనలో 18 మంది మరణించగా, పైలట్ తీవ్రంగా గాయపడ్డాడు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu