అవినీతికి ప్రతిరూపం జగన్ పార్టీ: లోకేష్

 

 

nara lokesh jagan, jagan kiran kumar reddy, nara lokesh tdp

 

 

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజు పల్లె పల్లెకు టిడిపి కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతికి ప్రతిరూపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ...అసమర్ధతకు నిదర్శనం కాంగ్రెస్ పార్టీ అని ఆరోపించారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, తిరిగి గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలు టిడిపిని అందలమెక్కిస్తే రాష్ట్రం తిరిగి అభివృద్ధిలో పుంజుకుంటుందన్నారు.రాజకీయాల్లో సామాజిక న్యాయం పాటించిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వందమంది బిసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని తెలిపారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu