పాఠాలు చెబుతున్న నారా లోకేష్
Published on: Fri Sep 11, 2015 3:53PM

నారా లోకేష్ ...టీచర్ అవతారమెత్తారు. తెలుగు రాష్ట్రాల్లో పార్టీ బలోపేతం కోసం శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న చినబాబు...కార్యకర్తలకు పాఠాలు చెబుతూ బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులో నిర్వహించిన టీడీపీ శిక్షణా తరగతుల్లో పాల్గొన్న లోకేష్...పార్టీ బలోపేతం కోసం చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పథకాలు, పార్టీ విధానాలపై కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ, వైఎస్సార్ కాంగ్రెస్ విమర్శలను ఎలా తిప్పికొట్టాలో శిక్షణ ఇస్తున్నారు.ప్రభుత్వంపై దుష్ఫ్రచారాన్ని కార్యకర్తలే అడ్డుకోవాలన్న లోకేష్... జగన్ అబద్దాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామన్న ఆయన... రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబుదేనన్నారు.


