అనాథలకు ఆపన్న హస్తం అందించిన లోకేశ్

posted on: Jul 2, 2015 6:14PM

తెదేపా పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్త, పార్టీ యువనేత నారా లోకేశ్ ఇద్దరు అనాథ పిల్లలకు ఆపన్న హస్తం అందించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పేరేపల్లె గ్రామానికి చెందిన శిరష, మణి అనే పిల్లలకు ఉచిత విద్య అందించడానికి ముందుకొచ్చారు. శిరష, మణిల తల్లిదండ్రుల మరణించడంతో వారు అనాథలయ్యారు. అయితే వారి తల్లిదండ్రులు తెలుగుదేశం పార్టీకోసం ఎంతో పాటుపడ్డారని ఓ కార్యకర్త లోకేశ్ కు మెయిల్ పంపడంతో వెంటనే స్పందించిన లోకేశ్ అనాథ పిల్లలు గురించి వారి తరపు బంధువులు గురించి వివరాలు తెలుసుకొని ఎన్టీఆర్ భవన్ కు పిలిపించారు. శిరిషకు ఎన్టీఆర్ మహిళా జూనియర్ కాలేజ్ లో, మణికి ఎన్టీఆర్ మోడల్ స్కూల్ లో ఉచిత విద్య అందించేలా పత్రాలు అందజేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...