నన్నపనేనికి వడదెబ్బ.. కుదుటపడిన ఆరోగ్యం

 

తెలుగుదేశం నాయకురాలు నన్నపనేని రాజకుమారి వడదెబ్బకు గురై అస్వస్థతకు గురయ్యారు. స్పృహతప్పి పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స చేయడంతో ఆమె కోలుకున్నట్టు తెలుస్తోంది. బుధవారం రాత్రి తిరుపతిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ టీడీఎల్పీ నాయకుడిగా ఎన్నికయ్యే కార్యక్రమం ఏర్పాట్లను నన్నపనేని రాజకుమారి పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఎండలో తిరగడం వల్ల ఆమెకు వడదెబ్బ తగిలి స్పృహ తప్పారు. వెంటనే స్పందించిన తెలుగుదేశం నాయకులు ఆమెను తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు తక్షణం చికిత్స చేయడంతో కోలుకున్నారని తెలిసింది.