స్కూలు బస్ ప్రమాదం: నాందేడ్ ప్యాసింజర్ డ్రైవర్ షాక్!

 

నాలుగు గంటలు ఆలస్యంగా నడుస్తున్న నాందేడ్ ప్యాసింజర్ సరిగ్గా మెదక్ జిల్లా మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేట క్రాసింగ్ దగ్గరకి వచ్చింది. సరిగ్గా అక్కడకి రైలు వేగంగా వచ్చేసరికి ట్రాక్ మీద అడ్డంగా వున్న స్కూలు బస్సును చూసి రైలు డ్రైవర్ బిక్షపతిగౌడ్ షాక్ అయ్యాడు. కనీసం బ్రేక్ వేసి రైలు ఆపే అవకాశం కూడా లేకపోవడంతో బస్సును ఢీకొని రైలు ముందుకు ఈడ్చుకుపోయింది. అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న రైలు డ్రైవర్ బిక్షపతి గౌడ్ సడెన్ బ్రేక్ కూడా వేయలేకపోయాడు. ఎందుకంటే రైలుకు సడెన్ బ్రేక్ వేస్తే వెనుక వున్న బోగీలన్నీ పట్టాలు తప్పి ఇంకా పెద్ద ప్రమాదం జరిగే అవకాశం వుంది. అందుకే రైలు డ్రైవర్ రైలుకు నెమ్మదిగా బ్రేకులు వేశాడు. అయినప్పటికీ ప్రమాదానికి గురైన బస్సును అర కిలోమీటర్ దూరం ఈడ్చుకు వెళ్ళిన తర్వాతే రైలు ఆగింది. ఈ అరకిలోమీటరు దూరం రైల్వే ట్రాక్ రక్తసిక్తమైంది.