తెలంగాణలో ఓటమి..ఏపీలో ప్రచారం

 

తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూటమి అభ్యర్థిగా టీడీపీ తరుపున కూకట్ పల్లి నుంచి బరిలో నిలిచి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆమె గెలుపుకోసం నందమూరి,నారా కుటుంబాలు రంగంలోకి దిగినప్పటికీ ఆమె పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ఓటమి పాలైతేనేం పార్టీ కోసం పని చేస్తా అంటున్నారు సుహాసిని. ఏపీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనటానికి సిద్ధమంటున్నారు. సంక్రాంతి సందర్భంగా తెనాలి వచ్చిన ఆమె విలేకర్లతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ఆదేశిస్తే ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని సుహాసిని తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించేందుకు సీఎం కృషి చేస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో టీడీపీ విజయానికి తమ కుటుంబం శక్తి వంచన లేకుండా సహకరిస్తుందని స్పష్టం చేశారు.