అప్పుడు చేసింది తప్పే..

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ తాను చేసిన పనికి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే 1991లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కరసేవకులను అదుపు చేసేందుకు ములాయం కాల్పులకు ఆదేశాలిచ్చారు. ఈ కాల్పుల్లో 16 మంది చనిపోగా, మరెందరో తీవ్రంగా గాయపడ్డారు. 26 సంవత్సరాల తర్వాత దీనిపై ఆయన ఇవాళ వివరణ ఇచ్చారు. దేశ సమైక్యత కోసం ఆ ఆదేశాలు ఇవ్వక తప్పలేదన్నారు. కరసేవకులపై కాల్పులకు ఆదేశాలివ్వడం, పొరపాటేనని, కాని ముస్లింలను కాపాడేందుకు మరో మార్గం లేక అలా చేయాల్సి వచ్చిందన్నారు. అయితే కాల్పుల అనంతరం దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu