నాలుగోరోజు గృహ నిర్బంధంలో ముద్రగడ... భారీగా పోలీసులు

 

కాపు నేత ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. గత నాలుగు రోజులుగా ఆయన గృహ నిర్బంధంలోనే ఉండగా... ఆయన, ఏ క్షణమైనా బయటకు తప్పించుకు వచ్చి వెళ్లిపోగలడని భావించి పెద్ద సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అంతేకాదు  అతని కదలికలను బాడీ వార్మ్ కెమెరాలతో చిత్రీకరిస్తున్నారు. ఈ విధానంలో శరీరంలో వేడి హెచ్చతగ్గుల ఆధారంగా థర్మల్ బేస్డ్ వీడియో లభిస్తుంది. మరోవైపు ముద్రగడ మాట్లాడుతూ, పోలీసులు ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండమంటే అన్ని రోజులు ఉంటానని, వారు వెళ్లిపోయిన తరువాతే పాదయాత్ర చేపడతానని స్పష్టం చేశారు. పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించిన తరువాత జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చిస్తానని స్పష్టం చేశారు.

 

ఇదిలా ఉండగా ముద్రగడ పద్మనాభం పాదయాత్ర చేపట్టాలని చూస్తున్న సంగతి తెలిసిందే. ఈయన పాదయాత్ర పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు ముద్రగడకు అనుకూలంగానే తీర్పు నిచ్చింది. ఆయన పాదయాత్రకు అనుమతించింది.