ఇంక్ గుర్తుపై ఎన్నికల సంఘం ఆగ్రహం...

 

పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. పాత నోట్ల మార్పిడి కోసం జనం బ్యాంకుల వద్ద బారులు తీస్తున్నారు. అయితే తీసుకుంటున్న వారే పదే పదే వచ్చి తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్యలను అరికట్టడానికి గాను కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ప్రజలు తమ వద్ద ఉన్న డబ్బును ఎక్సేంజ్ చేసుకునేపుడు బ్యాంకు అధికారులు వారి ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు పెట్టడం. నిన్నటి నుండి ఈ పద్దతి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ విషయంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయినట్టు సమాచారం. నోటు మార్పిడి చేసుకునే వారికి ఇంకు గుర్తు పెట్టడం ఏంటని ప్రశ్నించింది. త్వరలో ఐదు రాష్ర్టాల్లో ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ హెచ్చరిక చేసినట్టు తెలుస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం దీనికి స్పందిస్తుందో లేదో చూడాలి.