బీహార్ ఎన్నికలలో లాలూ - నితిష్ కూటమి పైచేయి

 

బీహార్‌లో 10 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం నాడు వెలువడ్డాయి. ఈ ఎన్నికలలో ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ కూటమికి ఆరు స్థానాలు దక్కగా, భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలను గెలుచుకుంది. ఈ ఎన్నికలలో ఎవరికి వారే పోటీ చేస్తే అందరూ ఘోర పరాజయం చెందడం ఖాయమని తెలుసుకున్న ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ పార్టీలు ఉమ్మడిగా పోటీ చేశాయి. రాజకీయంగా పరమ శత్రువులైన ఈ మూడు పార్టీలూ ఉప ఎన్నికల కోసం ఒక్కటి కావడం బీహార్‌లో గమనించదగ్గర రాజకీయ పరిణామం. బీహార్‌లో నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకోవడం బీజేపీ వెనుకబాటుతనంగా భావించాల్సిన అవసరం లేదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.