కేసీఆర్ మోడీ కాళ్లు పట్టుకున్నారు! జీవన్ రెడ్డి సంచలన కామెంట్లు 

తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మోడీకి  మొగుడిని అవుతానంటూ ఢిల్లీకి వెళ్లిన కేసీఆర్.. ట్రాన్స్ జండర్ అయ్యారంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.ఢిల్లీలో మోడీ కాళ్ళు పట్టుకున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు జీవన్ రెడ్డి.  కేసీఆర్ శిఖండిగా మారారని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ కేసీఆర్ జగీర్ కాదన్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా మంత్రులను రోడ్లపై కూర్చో పెట్టి ధర్నా చేయించిన కేసీఆర్ .. వ్యవసాయ చట్టంపై  ఎందుకు యూ టర్న్ తీసుకున్నారని ఆయన నిలదీశారు.  కొత్త  వ్యవసాయ చట్టాలు రైతుల అవకాశాలను పూర్తిగా దెబ్బతీస్తుందన్నారు. 

 కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం పచ్చి మోసమన్నారు జీవన్ రెడ్డి. రైతుకు మద్దతు ధర ప్రకటించటంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. కనీస మద్దతు ధర లభిస్తేనే రైతులకు న్యాయమన్నారు. శ్మశానవాటికలు, డప్పింగ్ యార్డులను కాంగ్రెస్ తీసుకొచ్చిన  ఉపాధి హామీ పథకంతోనే అభివృద్ధి చేస్తున్నారన్నారు.  కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే రైతుకు మద్దతు ధర కల్పించిందని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు దుకాణం తెరవకుంటే‌‌.. టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందన్నారు జీవన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు చేయకుంటే టీఆర్ఎస్ కార్యకర్తలను గ్రామాల్లో తిరగనియ్యమని హెచ్చరించారు.