రోజా క్షమాపణలు చెప్పినట్టయితే వేరేలా ఉండేది..

 

సస్పెన్షన్ విషయంలో ఏపీ అసెంబ్లీ రోజాకు మరో అవకాశం ఇచ్చినట్టు కనిపిస్తోంది. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరవ్వడానికి మరో అవకాశం ఇచ్చారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఆనాడు రోజా క్షమాపణలు చెప్పినట్టయితే సభా నిర్ణయం మరోలా ఉండేది.. రోజా యుద్దమార్గాన్ని ఎంచుకున్నారు అని అన్నారు. ప్రివిలేజ్ కమిటీకి రోజా వచ్చి వివరణ ఇచ్చేంత వరకూ.. రోజాపై సస్పెన్షన్ కొనసాగుతోందని స్పీకర్ తేల్చి చెప్పారు. మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. రోజాకు అసెంబ్లీ ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుంటారు.. ప్రివిలేజ్ కమిటీ ముందు రోజా హాజరవుతారు.. రాజకీయంగా రోజాను ఎదుర్కోలేకే వ్యక్తిగత వేధింపులు చేస్తున్నారని అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu