బియాస్‌ దుర్ఘటన: మిస్సింగ్‌, డెత్‌ సర్టిఫికెట్లు

 

 

 

బియాస్‌ నదిలో గల్లంతైన 24 మంది విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 8 మంది మృతదేహాలు లభించాయి. మిగిలిన వాటి కోసం గాలింపు కొనసాగుతుంది. లభించిన విద్యార్థుల మృతదేహాలపై డెత్‌సర్టిఫికెట్లు, మృతదేహాలు లభ్యం కాని వారిపై మిస్సింగ్‌ సర్టిఫికెట్లను బాధిత కుటుంబాలకు హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ సర్టిఫికెట్లపై హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర రాజముద్రలు లేకపోవడంతో బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని సరి చేస్తామని హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణ ప్రభుత్వాలు చెప్పాయి. మృతదేహాలు లభిస్తే హైదరాబాద్‌కు తరలిస్తామని హిమాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది.