మాజీ మంత్రి మెట్ల కన్నుమూత

 

తూర్పు గోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం నాడు తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గం నుంచి మెట్ల సత్యనారాయణ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మెట్ల సత్యనారాయణ మరణం పట్ల పలువురు తెలుగుదేశం నాయకులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu