భార్యాపిల్లల్ని గొడ్డలితో నరికాడు...

 

కడప జిల్లాలో పెళ్ళాం పిల్లల్ని గొడ్డలితో దారుణంగా నరికేసిన ఒక అనుమాన పిశాచి ఉదంతం ఇది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి ఎప్పటి నుంచో తన భార్య మీద తీవ్రమైన అనుమానం. తమకు ఉన్న కుమార్తె, కుమారుడు కూడా తనకు పుట్టినవారు కాదన్న అనుమానం అతనికి వుండేది. ఆ అనుమానం పెనుభూతంగా మారి మంగళవారం నాడు అతనిలోని రాక్షసుడు బయటపడ్డాడు. గొడ్డలి తీసుకుని భార్యని, ఇద్దరు పిల్లల్ని నరికేశాడు. దాంతో భార్య, కుమార్తె మరణించారు. కుమారుడు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంత దారుణానికి పాల్పడిన వ్యక్తి ప్రస్తుతం పరారీలో వున్నాడు.