ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాణిక్యాలరావు...

 

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ప్రస్తుతం  కంభంపాటి హరిబాబు బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన్ని ఆ పదవి నుండి తొలగించబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో మాజీ మంత్రి మాణిక్యాలరావును రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించబోతున్నారు. ఏపీలో వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో, హరిబాబు దూకుడుగా వ్యవహరించలేకపోతున్నారని ..హరిబాబు మెతకవైఖరి పట్ల బీజేపీ అధిష్ఠానం అసంతృప్తితో ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో, రాష్ట్ర అధ్యక్షుడి పదవికి మాణిక్యాలరావు, సోమువీర్రాజు, కన్నాలక్ష్మిణారాయణల పేర్లను పరిశీలించింది. వీరు ముగ్గురు ఒకే సామాజికవర్గానికి చెందినవారు. వీరిలో మాణిక్యాలరావువైపు అధిష్ఠానం మొగ్గుచూపింది. దీనికి సంబంధించి రేపోమాపో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. సోమువీర్రాజు వైపు తొలుత మొగ్గు చూపినప్పటికీ... ఆయన కొన్ని సందర్భాల్లో నోరు జారే అవకాశం ఉందని.. అందుకే దూకుడు, సంయమనం రెండూ ఉన్న వ్యక్తి మాణిక్యాలరావు అయితే కరెక్ట్ అని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.