దారుణం..కొడుకుని రైలు కిందపడేసిన తండ్రి...

 

ముంబైలో ఓ దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతండ్రే తన బిడ్డను రైలు నుండి విసిరేసిన ఘటన కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. సమీనా ఖాన్, ఖాదిర్ ఖాన్ అనే దంపతులకు రెండేళ్ల కైఫ్ ఖాన్ కుమారుడు ఉన్నాడు. అయితే రంజాన్ పండుగ సందర్బంగా వారు ముంబైలోని తమ బంధువుల ఇంటికి వెళ్లారు. అయితే అక్కడ కైఫ్ కనిపించకపోవడంతో తల్లి సమీనా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. ఇంతలోనే ఖాదిర్ ఖాన్ సమీనాకు ఫోన్ చేసి తాను కైఫ్ ఖాన్ ను కదులుతున్న రైలు కింది పడేశానని చెప్పాడు. విషయం విన్న సమీనా అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. సమాచారం మేరకు రైల్వే పోలీసులు కైఫ్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. ఖాదిర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. మరోవైపు తన భర్త ఎందుకిలా ప్రవర్తించాడో అర్థం కావడం లేదని సమీనా కన్నీరుమున్నీరుగా విలపించింది.