బంగాళదుంపలతో కరెంట్..

ప్రస్తుతం మనదేశంతో పాటు ప్రపంచం ముందున్న పెను సవాలు కరెంట్. అన్ని అవసరాలు ఆ కరెంట్‌తోనే ముడిపడి ఉండటంతో దానికి ఫుల్లు డిమాండ్ ఉంటోంది. దీంతో ప్రతి ప్రభుత్వం కోట్లు కుమ్మరించి మరి కరెంట్‌ను కొంటోంది. అయితే అన్ని దేశాలు కరెంట్ కొనలేవు కదా..? ప్రస్తుతం ఇలాంటి పరిస్ధితుల్లోనే ఉంది నైజీరియా. దేశంలో తినడానికే తిండి లేక అష్టకష్టాలు పడుతున్న సమయంలో కరెంట్ సమస్య ఈ ఆఫ్రికా దేశాన్ని వణికిస్తోంది. తన దేశం ఎదుర్కొంటున్న సమస్యకు ఒక యువకుడు చక్కని పరిష్కారం చూపాడు.  అలబి ఒలుసోలా అనే యువకుడు అనేక ప్రయోగాల ద్వారా బంగాళదుంపల నుంచి విద్యుత్‌ను తయారుచేశాడు. అలా తయారు చేసిన కరెంట్‌ను ఇంటి అవసరాలకు వాడుకుంటూ తమ కుటుంబానికి కరెంట్ బిల్లు కట్టె బాధ తప్పించాడు. ఆ యువకుడు చేసిన కృషిని గుర్తించిన ప్రభుత్వం...ఆ మార్గంలో సహజ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంపై దృష్టిసారించింది.