మెట్రో స్టేషన్‌ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య

 

అమీర్‌పేట్‌ మైత్రీవనం మెట్రో స్టేషన్‌‌ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈరోజు ఉదయం అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌ కు వచ్చిన ఓ వ్యక్తి మొదటి అంతస్తు ఎక్కి.. సారథి స్టుడియో ప్రహారీ గోడ వైపు ఒక్కసారిగా దూకేశాడు. దీంతో తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆ వ్యక్తి వివరాలు తెలియరాలేదు. సమాచారమందుకున్న ఎస్ఆర్ నగర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అలాగే ఆ వ్యక్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి తరలించారు.