Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఎం.పి. గవర్నర్ కుమారుడి హత్య?
posted on: Mar 25, 2015 2:41PM

మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఎంపీపీఇబి (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో శైలేష్ యాదవ్ ఒక నిందితుడు. ఈ మధ్యే ఈ విషయం బయటపడింది. ఈ కుంభకోణంలో శైలేష్ యాదవ్ హస్తం వుండటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ రామ్ నరేష్ యాదవ్ తన పదవిని విడిచిపెట్టలేదు. ఈ కేసు ఇంకా విచారణలో వుండగానే శైలేష్ యాదవ్ మరణించడం సంచలనాన్ని సృష్టించింది. తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించి వున్న శైలేష్ యాదవ్ను పోలీసులు కనుగొన్నారు. ఈ అనుమానాస్పద మరణం హత్యేనని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శైలేష్ యాదవ్ మరణవార్త వినగానే గవర్నర్ రాంనరేష్ షాకై అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.






