ఎం.పి. గవర్నర్‌ కుమారుడి హత్య?

 

మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ కుమారుడు శైలేష్ యాదవ్ హత్యకు గురైనట్టు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో సంచలనం సృష్టించిన ఎంపీపీఇబి (మధ్యప్రదేశ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ బోర్డు) కుంభకోణంలో శైలేష్ యాదవ్ ఒక నిందితుడు. ఈ మధ్యే ఈ విషయం బయటపడింది. ఈ కుంభకోణంలో శైలేష్ యాదవ్ హస్తం వుండటంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేసినప్పటికీ రామ్ నరేష్ యాదవ్ తన పదవిని విడిచిపెట్టలేదు. ఈ కేసు ఇంకా విచారణలో వుండగానే శైలేష్ యాదవ్ మరణించడం సంచలనాన్ని సృష్టించింది. తన నివాసంలో అనుమానాస్పదంగా మరణించి వున్న శైలేష్ యాదవ్‌ను పోలీసులు కనుగొన్నారు. ఈ అనుమానాస్పద మరణం హత్యేనని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శైలేష్ యాదవ్ మరణవార్త వినగానే గవర్నర్ రాంనరేష్ షాకై అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు.