రేపు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన!

 

 

 

సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ కుమార్ రేపు ఉదయం ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ సారి లోక్ సభ ఎన్నికలను ఏడు దశల్లో నిర్వహించనున్నారు. నోటా ఆప్షన్ ను తొలిసారిగా ఈ ఎన్నికలలో ప్రజలు వినియోగించుకోనున్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా,సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఎన్నికల తేదీలు విడుదల అయిన వెంటనే కోడ్ అమలులోకి వస్తుంది.