వైసీపీలో కి కిరణ్..!!

1980లలో రాజస్థాన్ నుంచి వచ్చి నెల్లూరు లో ఓ సాధరణ నగల డిజైనర్ గా తన జీవితం మొదలుపెట్టి ఇప్పుడు దేశమంతా తన వ్యాపార సామ్రాజ్యం విస్తరింపచేసిన వ్యక్తి లలిత జ్యువెల్లరీ అధినేత కిరణ్.తాజాగా ఆయన వైసీపీ లో చేరతారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం చెన్నైలో ఉంటోన్న కిరణ్ కు నెల్లూరుతో అనుబంధం ఉంది. నెల్లూరులో కిరణ్ పలు సేవాకార్యక్రమాలను చేపట్టారు. తెలుగులో చక్కగా మాట్లాడగలిగిన కిరణ్ కి ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి పాపులారిటీ ఉంది.కొద్ది రోజుల క్రితం తూర్పు గోదావరి జిల్లాలో జగన్ ను కలిసిన కిరణ్ కుమార్ ను ఆయన వైసీపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.

 

 

ఈ ఆహ్వానంపై కిరణ్ యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపుగా కిరణ్ వైసీపీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం కిరణ్ టర్నోవర్ 15 వేల కోట్ల రూపాయలుంటుందని అంచనా. 2020 నాటికి 50 వేల కోట్ల టర్నోవర్ లక్ష్యంగా కిరణ్ తన వ్యాపారసామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు.ఇటువంటి బడా వ్యాపారి వైసీపీలో చేరితే....ఆ పార్టీకి అదనపు బలం చేకూరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.అయితే వైసీపీలో చేరడంపై కిరణ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.మరి ఆయన పార్టీ లో చేరతారా?లేదా?.ఒకవేళ చేరితే ఎక్కడ టికెట్ ఇస్తారు? ఇవ్వన్నీ తెలియాలి అంటే మరి కొంత కాలం ఎదురుచూడక తప్పదు.