కాంగ్రెస్ లోకి కూన శ్రీశైలం గౌడ్

 

kuna srisailam goud, kuna srisailam goud congress, MLA Srisailam Goud quits YSR Congress

 

 

కాంగ్రెస్ పార్టీతో విభేధించి వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అట్టహాసంగా చేరిన కుత్బుల్లాపూర్ స్వతంత్ర ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్ సమక్షంలో ఈ రోజు ఢిల్లీలో ఆయన తిరిగి పార్టీలో చేరారు. వైఎస్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న కూన ఎమ్మెల్యేగా గెలవక ముందు కార్పోరేషన్ చైర్మన్ గా కూడా ఉన్నారు. ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి రంగారెడ్డి జిల్లా కన్వీనర్ గా కూడా ఉన్నారు. తెలంగాణ విషయంలో జగన్ పార్టీ యూ టర్న్ తీసుకోవడంతో ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న ఆయన తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరారు.