కిడ్నీ రాకెట్ కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు అపోలో సిబ్బంది..

 

దేశ రాజధాని ఢిల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తనకు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల నిమిత్తం.. కిడ్నీ విక్రయించాడు. అయితే కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బు విషయంలో భార్య భర్తల మధ్య వివాదం రావడంతో అది కాస్త పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నీ రాకెట్ ను నిర్వహిస్తున్న ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అపోలో ఆస్పత్రి సిబ్బందిగా పోలీసులు గుర్తించగా.. కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులతో పాటు.. కిడ్నీ దాతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే వీరు నాలుగు కిడ్నీలు అమ్మేసినట్టు తెలుస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu