ఆత్మహత్యలకు కేసీఆరే కారణం: మధుయాష్కీ

 

 

kcr trs, Madhu Goud Yaskhi, Telangana Congress MP Madhu Yashki Goud

 

 

కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కీ గౌడ్ టీఆర్ఎస్ , కేసీఆర్ లపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణపై టీఆర్ఎస్ నేతలే మోసం చేస్తున్నారని గౌడ్ విమర్శించారు. పార్టీ కోసం నిధులు సేకరించి సొంత ఆస్తులు కూడబెడుతున్నారని ఆరోపించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు కేసీఆరే కారణమని అన్నారు. కేసీఆర్ పిట్టలదొరలా కథలు చెబుతున్నారని విమర్శించారు. 2014 ఎన్నికలే లక్ష్యమయితే ఉద్యమాలు ఎందుకు చేశారని ప్రశ్నించారు. ఉద్యమనేతకు సహనం ఉండాలి కాని అహంకారం ఉండకూడదన్నారు. తాను ఫామ్ హౌస్ లో పడుకోలేదని, తెలంగాణ కోసమే పనిచేస్తున్నానని తెలిపారు. వ్యక్తిగత రాజకీయ లబ్ది కోసమే టీఆర్ఎస్ లో చేరేందుకు కొంత మంది కాంగ్రెస్ ఎంపీలు ప్రయత్నిస్తున్నారని యాష్కీ అన్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu