గవర్నర్ కూడా ఓ ఇల్లు అడిగారు.. కేసీఆర్
posted on Nov 16, 2015 2:18PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో డబులు బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దీదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.. అందుకే వారికోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాం అని అన్నారు. ఇక నుండి పేదలకు కట్టించే ఇళ్లు డబుల్ బెడ్ రూం ఇళ్లే ఉంటాయి అని తెలిపారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని.. నియోజక వర్గానికి 400 ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. అంతేకాదు తనకూ ఓ ఇల్లు మంజూరు చేయండని గవర్నర్ అడిగారని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సైతం ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రశంసించారని.. కేంద్రం సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు.