అమరావతి... జంగిల్ గాయబ్!

వైసీపీ పాలనలో విధ్వసానికి గురైన రాజధాని నగరం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అభివృద్ధి పథంలో పయనిస్తోంది. అమరావతి అభివృద్ధికి ప్రభుత్వం మొదటి అడుగు వేస్తూ జంగిల్ క్లియరెన్స్ పనులకు ఆగస్టు నెలలో శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం అమరావతిలో జంగిల్ క్లియరెన్స్ పనులు ముగింపు దశలో వున్నాయి. 24 వేల ఎకరాల భూమిలో 36 కోట్ల వ్యయంతో ఆగస్టు నెలలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు 96 శాతం పూర్తయ్యాయి. వర్షాల కారణంగా క్లియరెన్స్ పనులకు అడ్డంకులు ఏర్పాడ్డాయి. వర్షాలు తగ్గినప్పుడల్లా క్లియరెన్స్ పనులు కొనసాగించారు. ఈ పనుల కాంట్రాక్ట్ తీసుకున్న ఎన్‌సీసీ సంస్థ మొత్తం 24 ఎకరాలను 99 గ్రిడ్స్.గా విభజించి దాదాపుగా 4 వందల యంత్రాలతో పనులు చేపట్టింది. తొలగించిన ముళ్ళకంపలను ముక్కలు ముక్కలుగా చేయడానికి హైదరాబాద్ నుంచి ఎనిమిది ప్రత్యేక యంత్రాలు రానున్నాయి. కంపల ముక్కలను సిమెంట్ పరిశ్రమల్లో, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో వినియోగించున్నారు. కంపలన్నీ తొలగించిన తర్వాత అమరావతి రాజదాని ఇప్పుడు పునర్వైభవానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తోంది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu
Related Segment News