జీడిమెట్లలో అర్థరాత్రి పేలుళ్లు..

అర్థరాత్రి జనం గాఢనిద్రలోకి జారుకున్న తర్వాత జీడిమెట్లలో ఒక్కసారిగా పెద్ద పెద్ద పేలుళ్లు వినిపించాయి. అంతే జనం ఉలిక్కిపడి లేచి..భయంతో ఇళ్లలోంచి రోడ్ల మీదకు పరుగులు తీశారు. జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఫ్యాక్టరీల నుంచి విషవాయువులను నాలాలోకి విడుదల చేయడంతో పేలుళ్లు సంభవించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వీవీన్ ఫ్యాక్టరీ ఎదుట కాలనీవాసులు ఆందోళన నిర్వహించారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఎమ్మెల్యే వివేకానంద హామీ ఇవ్వడంతో స్థానికులు అక్కడి నుంచి వెనుదిరిగారు. పేలుళ్లు సంభవించిన ప్రదేశంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.