ఏపీ మరో బీహార్ అవుతుంది...
posted on Mar 3, 2015 10:55AM
ఏపీ మరో బీహార్ అవుతుందా.... అయ్యబాబోయ్... ఏపీని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోయేలా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తుంటే, ఏపీ మరో బీహార్ అవుతుందనే భయపడిపోయే కామెంట్ చేసిందెవరు? ఇంకెవరు? తాడిపత్రి టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకరరెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సాయం విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ మరో బీహార్ అవుతోందని.. ఇంకా చెప్పాలంటే బీహార్ కంటే దారుణంగా తయారవుతుందని ఆయన అన్నారు. ప్రజల్లో సహనం నశిస్తే తిరగబడి ఉద్యమం చేస్తారని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టుకు వంద కోట్ల రూపాయలను కేటాయించడం చూస్తే ఆ ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందనేది అర్థమవుతోందని అన్నారు. అందువల్ల పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని త్వరగా పూర్తిచేసి గోదావరి జలాల్ని కృష్ణా డెల్టాకు, కృష్ణాజలాల్ని రాయలసీమకు ఇవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు.