అమ్మను ఒకచోట వదిలేశావు... భార్యను మరోచోట వదిలేశావు.

 

ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా చెప్పడంలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి దిట్ట. ఎవర్నైనా సరే భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తుంటారు. ఇప్పుడు తాజాగా ప్రధాని నరేంద్ర మోడీపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీ గురించి మాట్లాడుతూ.. ‘చరిత్రను పక్కదోవ పట్టించే పనులు చేయొద్దు. మేము చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అవసరమైతే రాజీనామాలు చేస్తాం. కానీ, రాజీనామాలు చేయడం ద్వారా ప్రత్యేక హోదా రాదు. ఐదుగురు రాజీనామాలు చేసినా, ఏడుగురు రాజీనామాలు చేసినా ఏం ఉపయోగం లేదు. నరేంద్ర మోదీ అనేటువంటి వాడు కఠిన శిల, స్పందించే హృదయం లేదు. ప్రేమాభిమానాలు అంటే అతనికి తెలియవు. ఆ పద్ధతిలో అతను  పెరగలేదు అని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు... ప్రేమతో పనిచేయడం నేర్చుకో! అనాధాశ్రమానికి వెళ్లి ఇద్దరు పిల్లలను తెచ్చి పెంచుకుంటే, ఆ ప్రేమ మాధుర్యమేంటో తెలుస్తుంది! నీకేమి తెలుస్తుంది! అమ్మను ఒకచోట మూలన వదిలేశావు... భార్యను మరోచోట వదిలేశావు..టింగు రంగా అంటూ నువ్వొక్కడివే ఉన్నావు! ప్రేమను పంచు..ప్రేమను స్వీకరించు!’ అని మోదీకు ఆయన సూచించారు. మరి దీనిపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో చూద్దాం...