మృత్యు ఒడిలోకి చేరిన జయలలిత...


తమిళనాడు ఒక్కసారిగా స్ఠంభించిపోయింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ముఖ్యమంత్రి జయలలిత ఇక లేరు అన్న వార్త వినగానే అభిమానులకు ప్రాణం పోయినంత పని అయింది. మొన్న రాత్రి గుండె పోటుకు గురైన అమ్మకు అపోలో వైద్య సిబ్బంది చికిత్స అందించారు. అయితే సాధారణ చికిత్సకు ఆమె స్పందించక పోవడంతో ఎక్మో పద్దతి ద్వారా చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. అయితే అప్పటికే ఆమె పరిస్థితి విషమంగానే ఉందని.. ఆమెను బ్రతికించేందుకు ప్రయత్నిస్తున్నామని.. అభిమానుల ప్రార్థనలే ఆమెను కాపాడాలని వైద్యులు చెప్పినా జరగాల్సింది జరిగిపోయింది. నిన్న రాత్రి ఆమె తన తుదిశ్వాసను విడిచారు.

 

మరోవైపు జయలలిత మరణించడంతో దేశవ్యాప్తంగా రాజకీయ నేతలు ఆమెకు సంతాపం తెలిపారు. ప్రధాని మోడీ జయలలిత మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ అమ్మ మృతికి సంతాపం తెలిపారు.