Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జయ నిర్దోషి.. స్వామి, డీఎంకే దిగ్భ్రాంతి
posted on: May 11, 2015 12:03PM

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత నిర్దోషి అని కర్ణాటక హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఈ కేసును దాఖలు చేసిన బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ తీర్పు ప్రతి మీద అధ్యయనం చేయాల్సి వుందని, ఈ కేసును తాను వదిలిపెట్టనని సుప్రీం కోర్టుకు వెళ్తానని ఆయన ప్రకటించారు. అలాగే ఈ తీర్పు ఏఐడీఎంకె రాజకీయ ప్రత్యర్థి డిఎంకె వర్గాల్లో కూడా కలవరం రేపింది. జయలలిత రాజకీయ కెరీర్ ముగిసినట్టేనని, రాబోయే రోజుల్లో తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్న డీఎంకే వర్గాలకు ఈ తీర్పు షాక్ ఇచ్చింది. తీర్పు వచ్చిన వెంటనే డీఎంకె వర్గాలు సమాలోచనలు జరుపుతున్నాయి. ఈకేసు విషయంలో డీఎంకె కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.






