నక్కిన ఉగ్రవాదులు..భారీ ఎన్ కౌంటర్...


జమ్మూకాశ్మీర్లో భారీ ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. జమ్మూకాశ్మీర్ పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులు దాక్కురన్న సమాచారం అందిన వెంటనే  భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. వారిని మట్టుబెట్టేందుకు ఆ ప్రాంతాన్ని సైన్యం చుట్టుముట్టింది. ఉగ్రవాదుల నుంచి కాల్పులు ప్రారంభమవడంతో సైన్యం దీటుగా సమాధానమిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. కాగా ఇప్పటికే జమ్మూకాశ్మీర్ లోని రాంపూర్ ప్రాంతంలో చొరబాటుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.