లోయలో పడ్డ ఆర్మీ ట్రక్కు.. ముగ్గురు జవాన్ల మృతి

 

జమ్ముకశ్మీర్‌లో రాంభన్ జిల్లాలో 300 అడుగుల లోయలో ఆర్మీ ట్రక్కు పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. జమ్మూ నుంచి  శ్రీనగర్ వెళ్లున్న ఆర్మీ వాహనం బ్యాటరీ చెష్మా’ అనే ప్రదేశం వద్ద  లోయలోకి దొర్లిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఆ వాహనంలో ప్రయాణిస్తున్న జవాన్లు చనిపోయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. మృతి చెందిన సైనికులను అమిత్‌ కుమార్‌, సుజిత్‌ కుమార్‌, మన్‌ బహదూర్‌గా గుర్తించినట్లు సైన్యం వెల్లడించింది. సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్‌, ఆర్మీ, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, సివిల్‌ క్యూఆర్టీ బృందాలు రాంబన్‌కు బయల్దేరినట్లు అధికారులు వెల్లడించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu