సీమాంధ్రలో గెలుపుపై జగన్ ధీమా

 

 

 

పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందులలో భాకరాపురం ప్రాంతంలో వున్న పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి వెళ్ళి జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా జగన్ పోలింగ్ కేంద్రంలో విధుల్లో వున్న పోలింగ్ సిబ్బందికి వంగి వంగి దణ్ణాలు పెట్టారు. ఈ సందర్భంగా జగన్ మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రలో తమ పార్టీ గెలుస్తుందన్న ధీమాని వ్యక్తం చేవారు. ఎన్నికల తర్వాత సీమాంధ్రలో వైకాపా ప్రభుత్వం ఏర్పడుతుందని తెలిపారు. కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని... ఈ వ్యవహారంపై తొందరపడబోమన్నారు. తనకు అన్నింటికన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని తెలిపారు.