జగన్ కి మూడో స్థానం..!

 

 

 

వైఎస్ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆదాయపన్ను చెల్లించడంలో మూడో స్థానంలో నిలిచారు. సుభాష్ అగర్వాల్ అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరగా ఆదాయపు పన్ను శాఖ ఈ వివరాలు వెల్లడించింది. ఆదాయపు పన్ను అత్యధికంగా చెల్లిస్తున్న వారిలో వ్యక్తిగత విభాగంలో మొదట షిరీన్, ద్వితీయ స్థానంలో కమల్ స్టీల్స్ అధినేత కమల్ జీత్ సింగ్ అహ్లువాలియా ఉండగా మూడో స్థానంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు.2011 – 2012 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయనకు ఈ స్థానం దక్కింది. ఇక ఈ సంగతి ఇలా ఉంటే ఆదాయపు పన్ను చెల్లింపులో టాప్ 3లో ఉన్న ముగ్గురులో ఇద్దరు కుంభకోణాల్లో ఉన్నవారే. రెండో స్థానంలో ఉన్న కమల్ జీత్ సింగ్ బొగ్గు కుంభకోణంలో ఉండగా, అక్రమాస్తుల కేసులో ఇప్పటికే 15 నెలలు జైలు జీవితం అనుభవించి జగన్ బెయిలు మీద విడుదలయ్యారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu