జగన్‌ దేశ పర్యటన

 

సమైక్య రాష్ట్రం కోసం గట్టిగా కృషి చేస్తున్నానన్న క్రెడిట్‌ కోసం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అన్నివిదాల ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ను ఏకపక్షంగా  విభజిస్తుందంటూ ఆరోపిస్ దేశ నాయకులను కలుస్తున్నారు జగన్‌.

అందులో భాగంగానే వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మరోసారి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కలవనున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం.. అడ్డగోలు రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జాతీయస్థాయిలో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.ఆంధ్రప్రదేశ్ విభజన ముసాయిదా బిల్లు కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని చెప్తున్న నేపథ్యంలో మరోసారి రాష్ట్రపతిని కలిసి విభజన ప్రక్రియలో జోక్యం చేసుకుని అడ్డుకోవాలని కోరనున్నారు.
 
జగన్‌మోహన్‌రెడ్డి శనివారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఢిల్లీలో రాష్ట్రపతిని కలవనున్నారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు జనతాదళ్ అధినేత శరద్‌యాదవ్‌ను కలిసి సమైక్యాంద్ర ప్రదేశ్‌కు మద్దతు కోరనున్నారు.ఆదివారం ఉదయం 11 గంటలకు బిజూ జనతాదళ్‌ అథినేత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ను కలసి రాష్ట్ర పరిస్థితులను వివరించనున్నారు.